డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన టిఆర్ఎస్

Spread the love
The TRS government cheated by saying that it would give a double bedroom house.


డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి మోసం చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం…. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ.


 .సాక్షిత : 2014 ,2018 ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి నిరుపేద కుటుంబానికి డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు
కానీ ఇంతవరకు హామీ నెరవేర్చలేదు
•ఏ ఒక్క కుటుంబాన్ని కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కాలేదు..

వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పండి

ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న …

డాక్టర్ వంశీకృష్ణ Ex ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగర్ కర్నూల్

•దళితులకు ఇస్తున్నటువంటి మూడు ఎకరాల భూమి మరియు డబల్ బెడ్ రూమ్ లో ఇల్లు ఇవ్వలేని ఈ చేతగాని ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని అందరు ఆశించారు
కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా వుండటం జరిగింది

టీ ఆర్ యస్ నాయకులు 2014 2018 ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీ అందరికీ డబల్ బెడ్ రూమ్ లో మంజూరు చేస్తామని మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది..

ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఓట్లు అడగడానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు కాబట్టి
పేద ప్రజలందరూ కూడా నిలదీసి అడిగి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా పనిచేయాలని కోరారు…

అచ్చం పేట నియోజకవర్గం లో ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో పద్మమ్మ అనే మహిళ గత ఐదు సంవత్సరాల నుండి పూరి గుడిసెలో నివాసం ఉంటున్నది , ఈరోజు మామిళ్ళపల్లి గ్రామన్ని సందర్శించి పలు సమస్యలు తెలుసుకోవడం జరిగింది
కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page