పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

Spread the love

సాక్షిత : 130 కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీలో చేరిక

రాష్ట్రం పచ్చగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పెళ్లకూరు కాలనీ నుంచి బజార్ సెంటర్ వరకు వందలాదిమంది ర్యాలీ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు, నరసింహులు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు, గణేష్ 30 కుటుంబాలు, ఎల్లకూరు కాలనీవాసులు సాల్చింతల వాసులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు, అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే మన కాంగ్రెస్ పార్టీని బడా నాయకులని ఎదుర్కొని సామాన్యులు గా వస్తున్న మీరు నన్ను ఆదరించి గెలిపిస్తే షర్మిలమ్మ ఆశీస్సులతో కోవురుని శశశ్యామలంగా చేస్తాను నియోజకవర్గం అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారిపోయింది, మీరే ఒక్కసారి ఆలోచించండి ఆరుసార్లు గెలిచారు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి ఏమి చేశారు పేదవాడు పేదవాడు గానే ఉన్నాడు, ఆయనకి కోట లోనే ఓటు, ఒకసారి మీరే ఆలోచించండి ,తెలుగుదేశం విషయానికి, నాలుగున్నర సంవత్సరం సేవ చేసిన దినేష్ రెడ్డిని కాదని గొప్పింటి వారికి టికెట్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే, పార్టీని నమ్ముకున్న వారికి మొండి చేయి చూపించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే, ఆ ప్రశాంతమ్మకి రాజకీయాల గురించి ఏమి తెలుసు, ఇద్దరు పెద్ద నాయకులని ఎదుర్కోబోతున్న సామాన్యుని కోవూరు ప్రజలు మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు..
.

Related Posts

You cannot copy content of this page