మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

Spread the love

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లోని KVR కన్వెన్షన్ హాల్ నందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజానోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన నారి న్యాయ్ సమ్మేళనం కి ముఖ్య అతిధిగా అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబ , రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు , ఏఐసీసీ కుత్బుల్లాపూర్ పార్లమెంట్ ఎన్నికల అబ్జర్వెర్ జ్యోతి మణి , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి , కుత్బుల్లాపూర్ కో ఆర్డినేటర్ శోభారాణి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ,టిపీసీసీ ప్రధాన కార్యదర్శిలు నర్సారెడ్డి భూపతి రెడ్డి ,జ్యోత్స్న శివా రెడ్డి ,పున్నా రెడ్డి , NMC మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందని ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్ట మొదటిగా మహిళల కోసం మహాలక్ష్మి పథకం ద్వారా RTCలో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ రు.500కె వంటి పథకాలను అమలు చేసిందని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందుతుందని, 3 రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని మహిళలు తప్పకుండ తమ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Related Posts

You cannot copy content of this page