తల్లాడలో చెక్ పోస్ట్ ను పరిశీలించిన వైరా సీఐ నునావత్ సాగర్

Spread the love

మండుటెండలో వాహనాలను తనిఖీచేసిన సీఐ..

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తల్లాడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కల్లూరుకు వెళ్లే రోడ్డులో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ చెక్ పోస్ట్ ను వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ నునావత్ సాగర్ పరిశీలించారు. అనంతరం ఆయన వాహనాలను తనిఖీ చేశారు. మండుటెండలో సైతం వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పత్రాలు కలిగి ఉండాలని, ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. అక్రమంగా మద్యం, నగదును తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైరా ఎస్సై వంశీకృష్ణ భాగ్య రాజ్, నాగుల్ మీరా, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page