ప్రగతి నగర్ లో రూ.50 లక్షలతో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు శంకుస్థాపన- ఎమ్మెల్యే కె.పి వివేకానంద్

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ శ్మశాన వాటికను ఒక మోడల్ గ్రేవ్ యార్డు వైకుంఠధామంగా తీర్చిదిదుతామని,
ఇక్కడకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు. అలాగే ప్రశాంతమైన వాతావరణం కల్పించే విధంగా పచ్చదనం పెంపు, కూర్చునేందుకు వీలుగా వసతి గదులు, తదితర సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో – ఆప్షన్ సభ్యులు, అధికారులు, NMC బీఆర్ఎస్ అధ్యక్షులు, డివిజన్ల అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీ అసోసియేషన్ సభ్యుల, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page