షాదిఖానా నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయించండి

Spread the love

హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ బాబు గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి.

హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేయాలని నేడు సింగపూర్ లోని క్యాంపు కార్యాలయంలో వొడితల ప్రణవ్ బాబు ని కలిసి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు,ఈ సందర్భంగా ముజాహిద్ మాట్లాడుతూ హుజరాబాద్ పట్టణంలో ముస్లిం షాదీ ఖానా నిర్మాణం కొరకు దాదాపు 30 సంవత్సరాల క్రితము అప్పటి ప్రభుత్వం 20 గంటల స్థలం మంజూరు చేసిందనీ,అప్పుడు ఒక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది,ఆ షెడ్డును ఎవరు కూడా ఉపయోగించే పరిస్థితి లేక అది పూర్తి స్థాయిలో కూలిపోవడం జరిగింది,అదే స్థలములో అన్ని హంగులతో పూర్తిస్థాయిలో షాదీఖానా నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేయాలని కోరారు,హుజురాబాద్ మండల ప్రాంతంలోని చుట్టుపక్కల ముస్లింలందరికీ ఈ షాదిఖానా ఉపయోగకరంగా ఉంటుందని,ఈ రోజులలో నిరుపేద ముస్లిం సోదరులు పెళ్లిళ్లు చేయాలంటే షాదీఖాన కిరాయిలకి లక్ష రూపాయలు పైగా ఖర్చు అవుతుంది,హుజురాబాద్ పట్టణంలోని ముస్లింల షాదీ ఖానా నిర్మాణం కాలేక,ఇక్కడ నివసిస్తున్న ముస్లిం సోదరులు ఫంక్షన్ హాల్ లో పెండ్లిలు చేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు,కనుక గతంలో ముస్లింల షాదీ ఖానా కొరకు ఇచ్చిన స్థలము అందుబాటులో ఉంది,కావున ఆ యొక్క షాదిఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు నిధులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే హుజురాబాద్ నియోజకవర్గం ముస్లిం సోదరులు ఎల్లప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుర్తుంచుకుంటారని తెలియజేశారు,

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా ముస్లింల సంక్షేమం కొరకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేదు,కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ కృషి చేస్తుంది కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కావున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పోన్నం ప్రభాకర్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు దృష్టికి తీసుకుని వెళ్లి నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు,హుజురాబాద్ పట్టణంలోని ముస్లిం సోదరులను దృష్టిలో పెట్టుకొని ఎవరు పూర్తి చేయనటువంటి ముస్లింల షాదిఖానా కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో నిర్మాణం చేసి ముస్లిం సోదరులకు ఇచ్చినచో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముస్లిం సోదరులు జీవితకాలం గుర్తుంచుకుంటారని,దయచేసి హుజురాబాద్ పట్టణంలోని ముస్లింల షాదీఖానా నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయల నిధులను మంజూరి చేయించగలరని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Whatsapp Image 2024 01 17 At 5.16.25 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page