జగద్గిరిగుట్ట రింగు బస్తి లో కమ్యూనిటీ హాలు భావన నిర్మాణ పనులకు శంకుస్థాపన

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి లో రూ.10 లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాల్, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధులు కొరత లేదని, ఇటీవలే ముఖ్యమంత్రి కేసిఆర్ అదనంగా అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేదుకు ప్రభుత్వం సిదంగా ఉందని చెప్పారు. రాబోయే రోజులో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిదుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యేక్షులు రుద్ర అశోక్, జగద్గిరిగుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ వేణు యాదవ్, రషీద్ భాయ్, సీనియర్ నాయకులూ మఖ్సూద్ అలీ, అజరాత్ అలీ, పాపయ్య గౌడ్, మల్లరెడ్డి, మెట్టు శ్రీను, ఆర్. యాదగిరి, వెంకటేష్, సుధీర్ పటేల్, రవి గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page