భట్టి ని కలిసిన టిడిపి జిల్లా నాయకులు

Spread the love

District leaders of TDP met Bhatti

భట్టి ని కలిసిన టిడిపి జిల్లా నాయకులు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తెలుగుదేశం పార్టీ మదిర నియోజకవర్గం ముఖ్య నాయకులతో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మరియు ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు కలిసి సిఎల్పీ మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు బట్టి విక్రమార్క ని మర్యాదపూర్వకంగా తన క్యాంపు కార్యాలయంలో కలిసి ముందుగా మధిర నియోజకవర్గానికి దళిత బంధు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులను గుర్తించాలని కోరారు,

అలాగే నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పై వారికి విన్నవించడం జరిగింది. అలాగే నియోజకవర్గం లోని మధిరని రెవిన్యూ డివిజన్ గా చేయాలని, సీఎం రిలీఫ్ ఫండ్ విజ్ఞప్తులను పరిష్కరించాలని రోడ్ల సమస్యల పరిష్కరించేలా కృషి చేయాలని మేము తెలియచేసిన అన్ని విషయాలపై స్పందించి అన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తారని హామీ ఇచ్చారు.

వారిని కలిసిన వారిలో ఖమ్మం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు గుత్తా సీతయ్య, కేతినేని హరీష్, మండల పార్టీ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు, మార్నిడు పుల్లారావు, రావుట్ల సత్యనారాయణ, దోమందుల సామేలు, కనపర్తి వీరబాబు, ఖమ్మం నగర అధ్యక్షులు వడ్డెం విజయ్,సాదినేని హనుమంతరావు, చింతనిప్పు నాగేశ్వరరావు, గురిజాల సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page