ముక్కోటి దేవతల శుభ దీవెనలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి

Spread the love

All the people should be safe with the auspicious blessings of the three gods

ముక్కోటి దేవతల శుభ దీవెనలతో ప్రజలంతా క్షేమంగా ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

సాక్షిత : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీ సమేతంగా మరియు ఇతర ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్ పట్టణంలోని 34వ వార్డులో గల * వేంకటేశ్వర స్వామి* వారిని మరియు ఆలంపల్లిలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకొని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వికారాబాద్ జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ప్రజలకు శుభం కలగాలని, ఆ స్వామి వార్ల కృప కటాక్షాలు అందరికీ ప్రసాదించాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page