బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన

Spread the love

సాక్షిత : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి బోయిన్పల్లిలోని 1కోటి 38 లక్షల రూపాయలతో వివిధ కాలనీలో సిసి రోడ్ల కొరకు శంకుస్థాపన నిర్వహించారు ..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన పాదయాత్రలో గుర్తించిన పెండింగ్ పనులను పూర్తిచేయాలనే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నిధులు మంజూరు చేయించుకుని వెంటనే పనులు పూర్తి చేసేలా నేడు శంకుస్థాపన నిర్వహించామని తెలిపారు ..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ..

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రపంచ వేదికపై హైదరాబాద్ మహానగరం నేడు పెట్టుబడులకు స్వర్గ దామముగా మారిందని ఇందుదకనుగుణంగానే బస్తీలు కూడా ఎంతో మెరుగ్గా ఉండాలని ఉద్దేశంతో నిధులు కొరత లేకుండా అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నామని… ఆకలితో వచ్చే వారికి నేనున్నానంటూ అన్నం పెట్టి కడుపు నింపే నగరం మన భాగ్యనగరం అని.. అందరినీ ఆదరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు…

Related Posts

You cannot copy content of this page