సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

Spread the love

సాక్షిత.. సికింద్రాబాద్ : డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ నియోజకవర్గం లోని బౌద్దనగర్ డివిజన్లో విస్తృతంగా పర్యటించి సుమారుగా రూ.2 కోట్ల ఖర్చుతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి కంది శైలజ అధికారులు, నేతలతో కలిసి అంబర్ నగర్, ఎల్ నారాయణ నగర్, ఈశ్వరి బాయి నగర్, బౌద్ధనగర్, వారసిగుడా, అశోక్ నగర్, సంజీవ పురం తదితర ప్రాంతాల్లో పాదయాత్రను నిర్వహించారు. బీ ఆర్ ఎస్ యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, తో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని, అభివృద్దిని నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు ఓ వైపు, తాము చేపడుతున్న అభివృద్ధి పనులు మరో వైపు సికింద్రాబాద్ ప్రజానీకం నుంచి తాము మెప్పును పొందేలా దోహదపడుతున్నాయని తెలిపారు. కేవలం ఎన్నికల ముందే ప్రజల్లో నిలిచేలా కాకుండా నిరంతరం ప్రజలతో తాము మమేకమవుతున్నామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page