టీడీపీలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాసర్ల ప్రసాద్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,
అందుచేతనే *టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరానన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతం అయిందని ఆనందం వ్యక్తం చేశారు.
బహిరంగ సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ప్రకటించిందని తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతానని షర్మిల స్పష్టం చేశారు… చంద్రబాబు, జగన్, పవన్ లు కేంద్రంలో మోడీ వద్ద మోకరిల్లుతున్నారని వారు నడుపుతున్నవి పార్టీలు కాదని, కార్పొరేట్ కంపెనీలని ఏద్దేవా చేశారు. ఆ మూడు పార్టీలు రాష్ట్రంలోని సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదని,
సమస్యలపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు…