మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత – మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా

Spread the love

ఎల్. బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం….
సాక్షిత* : జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…
మల్కాజిగిరి అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన పట్నం సునీత – మహేందర్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించినట్లయితే మన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అని అన్నారు….

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి, అహంకారపురితమైన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పట్టం కట్టారో…
అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేంద్రం లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు…

ఇక్కడ రాష్ట్రంలో కాని అక్కడ కేంద్రంలో కాని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ నారీ హామీలను తప్పకుండా ప్రజలకు అందుతాయని తెలిపారు….

ప్రతి ఒక్కరూ పట్నం సునీత మహేందర్ రెడ్డి హస్తం గుర్తుకు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు…

ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ,డీసీసీ ప్రధాన కార్యదర్శి, కళ్లెం నర్సింహా రెడ్డి, సుధాకర్ గౌడ్,జాలె వెంకట్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మల్కాజ్ గిరి ప్రధాన కార్యదర్శి, నిర్మల రెడ్డి మన్సూరబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు పుల్లయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు పృథ్వి రాజ్, శ్యామల్ రెడ్డి, నర్సింహా, మహిళా డీసీసీ మాజీ అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి,సిపిఐ కార్యదర్శి సుధాకర్, మీసాల స్వామి, లక్ష్మి, శోభ,బొంగు వెంకటేష్, కొప్పుల వెంకట్ రెడ్డి మరియు ఎన్ఎస్ యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page