మంత్రి విడ‌ద‌ల ర‌జినిని క‌లిసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌న‌సేన పార్టీ గుంటూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు నేరెళ్ల సురేష్‌

Spread the love

జ‌న‌సేన పార్టీ గుంటూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు నేరెళ్ల సురేష్ మంగ‌ళ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి విడ‌ద‌ల ర‌జినిని క‌లిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని తోపాటుగుంటూరు పార్ల‌మెంటు అభ్య‌ర్థి కిలారి రోశ‌య్య‌, గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి నూరి ఫాతిమా గెలుపు కోసం ప‌నిచేస్తామ‌ని సురేష్ చెప్పారు. ఈ రోజు వంద‌లాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తున్నామ‌న్నారు. ఆయ‌న‌తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు గులాం ర‌సూల్‌, బూసిరెడ్డి మ‌ల్లీశ్వ‌ర‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page