138వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం(మే డే) సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి

Spread the love

138వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం(మే డే) సందర్భంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా నిజాంపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి కార్మిక సోదరసోదరీమణులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చిందించి పోరాడి సాధించిన రోజు అని, అన్ని రంగాల్లో కార్మికులు ఎనలేని సేవలను అందిస్తున్నారని, ఎన్నో సేవలను అందిస్తున్న కార్మికులందరికి వందనాలు తెలుపుతూ,మరోమారు కార్మిక సోదరసోదరీమణులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ మహిళా నాయకురాలు సబిత జలంధర్ రెడ్డి,ఏఐటీయూసీ సభ్యులు పాలబిందేల శ్రీనివాస్,రాములు,ఆశి యాదయ్య,దుర్గయ్య,వెంకన్న,రాజయ్య,కృష్ణ,యాదమ్మ,అమృత,లక్ష్మి,ఇతర ముఖ్య సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page