30 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులు ప్రారంభం..!సబీహా గౌసుద్దీన్

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లైబ్రరీ పార్క్ వద్ద కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * 30 లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం స్థానికులు సిసి రోడ్డు కావాలని చెప్పి మా దృష్టికి తీసుకురావడంతో మేము *ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి విన్నవించుకోవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే తక్షణమే నిధులు మంజూరు చేయడంతో ఆయన సహాయ సహకారాలతో 30 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, కాశీనాథ్ చారి, రమేష్, రాము యాదవ్, లక్ష్మణ్, టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page