28 న చంద్రబాబు సభను విజయవంతం చేద్దాం

Spread the love

నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ టిడిపి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పొంగూరు నారాయణ,జోన్ 4 ఇంఛార్జి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 28 న
రా.. కదలిరా కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోవూరుకు రానున్నారని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జిలకు సూచించారు.

అనంతరం కుటుంబ సాధికార సారథులు నియామకాల పై, ఓటర్ వెరిఫికేషన్ పై ఇంఛార్జి లకు దిశానిర్దేశం చేశారు.

కార్యక్రమంలో కావలి, కోవూరు నియోజకవర్గ ఇంఛార్జి లు మాలేపాటి సుబ్బానాయుడు, పోలం రెడ్డి దినేష్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తాళ్లపాక రమేష్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, మాజీ శాసనమండలి సభ్యులు బూదాటి రాధాకృష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బొమ్మీ సురేంద్ర యాదవ్, ఆత్మకూరు, నెల్లూరు రూరల్
నియోజక వర్గాల పరిశీలకులు బుల్లెట్ రమణ, రాచమల్లు శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాళ్లపాక అనురాధ, మాజీ ఆప్కాప్ చైర్మన్ కొండూరు పాల్సెట్టి, ఎమ్మెల్సి కాండిడేట్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జెన్నీ రమణయ్య, దావా పెంచల్ రావు, పమిడి రవికుమార్ చౌదరి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, దొడ్డపునేని రాజా నాయుడు, బొబ్బూరి వెంగళరావు, టీడీపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 23 At 5.20.05 Pm
Print Friendly, PDF & Email

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page