జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు

Spread the love

Grand semi-Christmas celebrations at the district congress office

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్టమస్ వేడుకలు

జీసస్ చరిత్ర స్ఫూర్తి దాయకం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్

ఓర్పు సహనానికి ప్రతీక జీసస్

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో శుక్రవారం జిల్లా, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచి పెట్టారు. అనంతరం దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ.. క్రీస్తు పుట్టుక యూదుల వంశానికి గొప్ప వరమని అన్నారు.

నాడు వివక్షకు గురవుతున్న ప్రజల పక్షాన పోరాడి వారిని బంధ విముక్తి చేశారని తెలిపారు. మానవాళి రక్షణకు జీసస్ చేసిన సేవలను కొనియాడారు.నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ…జీసస్ జీవిత చరిత్ర ఆధర్శనీయమని అని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పు, సహనంతో ఎలా ఉండాలో జీసస్ క్రీస్తు నుండి నేర్చుకోవాలని అన్నారు.

జీసస్ క్రీస్తు దయతో వచ్చే ఏడాది డిసెంబర్ 25 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంకా ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం క్రైస్తవులకు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాస్టర్ దాబ్రియెల్ ప్రతేక ప్రార్థనలు నిర్వహించి, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులను,జిల్లా నాయకులను, కార్యకర్తలను ఆశీర్వదించారు.

నిరంతరం పార్టీ సుభిక్షంగా ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు, 8 వ డివిజన్ కార్పొరేటర్ లాకావాత్ సైదులు, 5 వ డివిజన్ కార్పొరేటర్ పల్లెబోయిన భారతి చంద్రం, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు,

ఖమ్మం నగర బీసీ సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, గజ్జెలి వెంకన్న,డివిజన్ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు, ఏసబోయిన శ్రీశైలం, కామ అశోక్, కాళంగి కనకరాజు, నాగటి చంద్రం, భూక్యా బాలాజీ, బచ్చలికూర నాగరాజు,యువజన నాయకులు జేర్రిపోతుల అంజిని, షేక్ వసీం,పేరం యశ్వంత్ వర్ధన్, నాని, యడవల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page