డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

Spread the love

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ పరిస్థితి పై గ్రామానికి చెందిన బొడ్రాయి బజార్ యువకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామంలో మురుగునీరు రోడ్ల పై ప్రవహిస్తుందని, తాము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదని వారు తమ ఆవేదనను తెలిపారు. మురుగు నీరు నిండి ఇండ్లలోకి వస్తుందన్నారు. దీని పై స్పందించిన తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి ఆదేశాలిచ్చారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామని యువకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వరికుప్పల మల్లేష్,కొమ్మగోని భిక్షం, నాతి సతీష్,నాతి రాజు,రూపని అజిత్, ఉమ్మెంత్తల శివప్రసాద్, ఆరూరి శ్రీనివాస్ బొడ్రాయి బజార్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page