మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నిక

Spread the love

మే 2, 6 మరియు 9వ తేదీలలో జరగనున్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం మరియు రోడ్ షో లను విజయవంతం చేయడం కోసం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో 130 డివిజన్ సూరారం సాయిబాబా నగర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇచ్చే విధంగా ప్రతిఒక్క కార్యకర్త పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి , నియోజకవర్గ ఎన్నికల అబ్సర్వర్ శోభ రాణి , డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page