పాయాయిల్ రైతుల చిరకాల కోరిక పామాయిల్ బోర్డ్ తెప్పించే బాధ్యత నాది..వినోద్ రావు

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజక వర్గంలో బీజేపి పార్లమెంట్ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావు ఎన్నికల ప్రచారములో పెద్ద ఎత్తున మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలుతో నడుస్తోంది..నియోజకవర్గ పర్యటన అశ్వారావుపేట చేరుకున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు కు బీజేపీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. రింగ్ రోడ్ నుంచి వెంకట సినీ థియేటర్ వరకు భారీ ర్యాలీలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

అనంతరం బస్టాండ్ దగ్గర కార్నర్ మీటింగ్ లో తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ స్థానికంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదని ప్రజలకు అవసరాలు తీర్చేలా ఎలాంటి సదుపాయాలు లేవని అన్నారు.విద్య, వైద్య,వ్యవసాయం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని పెన్షన్ రాని అవ్వా తాతలు నిరుత్సాహ పడవద్దని అశ్వారావుపేట లో ఎలాంటి గిడ్డంగులు కానీ,పరిశ్రమలు కానీ వచ్చినాయా అని కాంగ్రెస్ బి ఆర్ యస్ ఓట్ల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప అభివృద్ధి ఊసే లేదని తెలిపారు.. కొత్త రేషన్ కార్డులు ఇంత వరకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుందని అన్నారు..నన్ను ఢిల్లీ పంపండి మీకు ఢిల్లీ నుంచి వచ్చే పథకాలు ఇక్కడకి తీసుకువచ్చే హామి తనదే అని మరోసారి ప్రధానిగా మోడీ ని ఖమ్మం తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే అన్నారు.

Related Posts

You cannot copy content of this page