పార్లమెంట్ లో ప్రజల కోసం కొట్లాడే నాయకుడు రంజిత్ రెడ్డిని గెలిపించుకుందాం: మండల, మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రకాష్ గుప్త

Spread the love

శంకర్‌పల్లి మండలం ఎల్వెర్తి, కొజ్జగూడెం గ్రామాలలో కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం

సాక్షిత శంకర్‌పల్లి: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని శంకర్‌పల్లి మండల మరియు మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రకాష్ గుప్త పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా మండల పరిధి ఎల్వెర్తి, కొజ్జగూడెం గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతాయన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటే శంకర్‌పల్లి ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు. పార్లమెంట్ లో ప్రజల కోసం కొట్లాడే నాయకుడు రంజిత్ రెడ్డి అని, ఆయన గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిల పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో
మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు శివ యాదవ్, మండల వైస్ ప్రెసిడెంట్ నసీరుద్దీన్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, మండల మైనార్టీ ప్రెసిడెంట్ మహబూబ్ హుస్సేన్, నాయకులు షేరి అనంత్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీధర్, శ్రీధర్ గౌడ్, కృష్ణారెడ్డి, ప్రసాద్ రెడ్డి, శంకర్, శ్రీశైలం, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్ ముదిరాజ్ సమ్మిరెడ్డి, చెన్నారెడ్డి, మోహన్ రెడ్డి, రామచందర్, మల్లికార్జున్, రఘునందన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగమణి, ప్రత్యూష, పుష్పమ్మ, సుశీల, అమృత ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page