రూ.2 వేల పింఛన్‌ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్..

Spread the love

CM KCR is the leader who is filling the stomach of the poor by giving Rs. 2 thousand pension.

రూ.2 వేల పింఛన్‌ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్…

జీడిమెట్ల డివిజన్ కు చెందిన 1061 మందికి ఆసరా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ కు చెందిన 1061 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జీడిమెట్లలోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఏ రాష్ట్రంలో కూడా పేదలకు రూ.2 వేల పింఛన్‌ ఇవ్వడం లేదన్నారు.

రూ.2016 పింఛన్‌ ఇచ్చి పేదల కడుపు నింపుతున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ ఒక్కరే అని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో రూ.2 వేల పెన్షన్‌ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఓట్లకోసం కుట్ర రాజకీయాలు చేసే నేతలపట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page