CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

Spread the love

Government Whip Shri Arekapudi Gandhi handed over the CMRF-LOC sanction documents to the affected families

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన ( 5,50,000/-) ఐదు లక్షల యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా 5,50,000/- రూపాయలు మంజూరి అయినవి అని,

CMRF- LOC వివరాలు

1.చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ కి చెందిన శివ సాయి శరణ్య గారికి 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయలు

  1. హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ కి చెందిన నాగమణి కి 2,00,000/- రెండు లక్షలు
  2. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కి చెందిన నర్సిములు కు 1,00,000/- ఒక లక్ష రూపాయలు మొత్తం 5,50,000/- రూపాయలు
    మంజూరి అయినవి అని అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని గాంధీ గారు పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ గారు ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, కృష్ణ రావు, కుమార్, మంజుల ,భులక్ష్మి, రజిని తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page