కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని

Spread the love

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ని వివేకానంద నగర్, హైదర్ నగర్,ఆల్విన్ కాలనీ,కూకట్పల్లి(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 100 మంది లబ్ధిదారులకు 1,00,11,600/- ఒక కోటి పదకొండు వేల ఆరువందల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్యలయం లో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ ,శ్రీ జూపల్లి సత్యనారాయణ , నార్నె శ్రీనివాస రావు , మాజీ కార్పోరేటర్ మాధవరం రంగరావు తో కలిసి లబ్దిదారులకు చెక్కుల ను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వంద మంది లబ్దిదారులకు అందచేశామని రేపు శేరిలింగంపల్లి మండల పరిధిలో ని డివిజన్ల కు చెందిన 100 మంది లబ్దిదారులకు అందచేస్తామని మొత్తం 200 మంది లబ్దిదారులకు చెక్కులు అందచేయడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ కోరారు.

ఈ కార్యక్రమంలో RI శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, కూకట్పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ , హఫీజ్పెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాలా హరీష్ రావు ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రారెడ్డి, శ్రీనివాస్ , బ్రిక్ శ్రీనివాస్ ,పోతుల రాజేందర్,కాశినాథ్ యాదవ్,శ్రీధర్ రెడ్డి, కృష్ణ ముదిరాజు,ఎల్లం నాయుడు, వేణు, శ్రీనివాస్ ,బుజ్జి, రాము సతీష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page