చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం.

Spread the love

శేరిలింగంపల్లి గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా*
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం.
వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో వారి నివాసంలో జరిగిన సమావేశంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం నాగేందర్ యాదవ్ , జూపల్లి సత్యనారాయణ , నార్నే శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్లు సాయి బాబా , మాధవరం రంగారావు ,ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు ,అధ్యక్షలతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ ,కార్పొరేటర్లు, వారంతా ముక్తకంఠంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని,ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.పార్టీ రెండు సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని ఆ ఇద్దరిని ఓడించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటుందని,కేసీఆర్ ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్దాం అని, అందరిని సమన్వయం చేసుకుంటూ ప్రజలలోకి వెళ్లాలని, ప్రతి గడప గడప కి వెళ్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి ని వివరిస్తూ ఓట్లు అడుగుదాం అని ఎమ్మెల్యే తెలియచేసారు. కేసీఆర్ బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేశారు అని , బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి ,సమిష్టి కృషి తో పని చేద్దాం ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు సంజీవ రెడ్డి,రఘునాథ్ రెడ్డి,ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్ ,BSN కిరణ్ యాదవ్ ,రాజు నాయక్, లక్ష్మీనారాయణ, భాస్కర్ , బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాల హరీష్ రావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, లక్ష్మారెడ్డి, గంగాధర్, భిక్షపతి ముదిరాజు, పోతుల రాజేందర్ ,వేణు ,జిల్లా గణేష్,కాశినాథ్ యాదవ్,నిమ్మల రామ కృష్ణ గౌడ్, చిన్నోళ్ల శ్రీనివాస్, చంద్రిక ప్రసాద్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page