ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు గణ నివాళులు

Spread the love

Tributes to late former Chief Minister of Andhra Pradesh NTR

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు గణ నివాళులు

సాక్షిత ప్రతినిధి.

తెలుగు క్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు

టిడిపి కల్వకుర్తి నియోజకవర్గ నాయకులు బాదేపల్లి రాజు గౌడ్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నవరస నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా టిడిపి కల్వకుర్తి నియోజకవర్గ నాయకుడు బాదేపల్లి రాజు గౌడ్ కల్వకుర్తి నియోజకవర్గం పట్టణ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ దవఖానాలో రోగులకు, బాలింతలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ తెలుగు వారి క్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బ్రహ్మం, వజ్రలింగం, రామచంద్రారెడ్డి, ఈశ్వర్, అనిల్, గోపాల్, గణేష్, మధు, శ్రీశైలం, రాజు, గోపాల్, కృష్ణ, సురేందర్, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page