కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Spread the love

కృషి కాలనీలో, జై భావాని నగర్ లో 20 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

……

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సూరారం డివిజన్ పరిధిలోని కృషి కాలనీలో, జై భావాని నగర్ లో రూ.20లక్షలతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల కొరత లేదని, ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా అభివృద్ధి పనులకు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతీ కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ శాఖల చైర్మన్లు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘాల నాయకులు సభ్యులు, మహిళా నాయకురాలు, కాలనీ బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page