కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య పరిష్కారానికి మద్దతు

Spread the love

Seeking support to solve the problem of closure of cantonment roads

కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్య పరిష్కారానికి మద్దతు కోరుతూ ఎమ్మెల్యేను కలిసిన మర్రి రాజశేఖర్ రెడ్డి…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రాంతంలో రోడ్లు మూసివేయడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పలువురు ఎమ్మెల్యేలను మర్రి రాజశేఖర్ రెడ్డి కలిసి వివరిస్తున్న నేపథ్యంలో కంటోన్మెంట్ మాజీ బోర్డ్ సభ్యులతో కలిసి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే మద్దతునివ్వాలని అన్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సానుకూలంగా స్పందించి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు అటువైపుగా వెళ్తున్న క్రమంలో రోడ్ల మూసివేత వల్ల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

తప్పనిసరిగా ప్రజల పక్షాన ఈ సమస్యపై దృష్టి వహించి కంటోన్మెంట్ బోర్డ్ వారికి వినతి పత్రాన్ని అందజేయాలని మర్రి రాజశేఖర్ రెడ్డి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డ్ మాజీ సభ్యులు పాండు యాదవ్, శ్యామ్, నళిని కిరణ్, పెద్దల నర్సింహ, శ్రీకాంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page