‘ప్రగతి యాత్ర’లో భాగంగా 88వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

Spread the love

‘ప్రగతి యాత్ర’లో భాగంగా 88వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

సాక్షిత : సూరారం 129 డివిజన్ మార్కండేయ నగర్, నెహ్రూనగర్ లలో పాదయాత్ర…

బస్తీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు హారతులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని మార్కండేయ నగర్, నెహ్రూ నగర్ లలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా 88వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా తమ బస్తీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న చిన్నపాటి పనులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం అప్పల నాయుడు, డిఈఈ శిరీష, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శి సిద్ధిక్, వార్డు మెంబర్ అరుణ, సీనియర్ నాయకులు ఫెరోజ్, ముకుందం, గండయ్య, నవీన్, విఠల్, అఖిల్, దశరథ్, కిరణ్, కృష్ణ, దాస్ మరియు బస్తీల వాసులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page