రూ.7 కోట్లతో చేపడుతున్న క్రీడా సముదాయంను పరిశీలించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్..

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో రూ.7 కోట్ల వ్యయంతో చేపడుతున్న క్రీడా సముదాయంను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఇండోర్ క్రికెట్, ఫుట్ బాల్ కోర్టులు, 5 షటిల్ కోర్టులు, బాస్కెట్ బాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్ పనులు 70% పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు రెండు నెలల్లో వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అదే విధంగా అదనంగా పిల్లల్లకు స్కేటింగ్, టేబుల్ టెన్నిస్ వంటివి కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపా దేవి, ఏఈ కళ్యాణ్, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, తెలంగాణ సాయి, ఇబ్రహీం, మూసాకాన్, సాయిబాబా, లక్ష్మణ్, చిన్న చౌదరి, ఇమ్రాన్ బైగ్, చెట్ల వెంకటేష్, మహేష్, లింగం, అహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page