కను దృష్టి లోపం లేకుండా చూసుకోవాలి.

Spread the love


Make sure that the eye is not impaired.

తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా రెండవ కంటి వెలుగు, #MDR_ఫౌండేషన్ గౌరవ సలహాదారులు యం.ప్రిథ్వీరాజ్

సాక్షిత : పటాన్ చెరువు నియోజకవర్గంలోని స్థానిక లయన్స్ క్లబ్ కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి #MDR_ఫౌండేషన్ గౌరవ సలదారులు యం.ప్రిథ్వీరాజ్ పాల్గొని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కనుదృష్టి అనేది చాలా ముఖ్యమైనది ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తన ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటుందని అందులోనే భాగంగా రెండవసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి డాక్టర్లు సలహా సూచన మేరకు కను అద్దాలు వాడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు మాజీ జడ్పిటిసి జైపాల్ ముదిరాజ్ , పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ , పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ , పటాన్‌చెరు టౌన్ ప్రెసిడెంట్ ఆఫజల్ , లయన్స్ క్లబ్ సభ్యులు మరిము వైద్య అధికారులు, ఆశ వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page