బీజేపీ పార్టీ లో చేరిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు

Spread the love

Leaders of Telangana state movement who joined BJP party

బీజేపీ పార్టీ లో చేరిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకులు


సాక్షిత : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు తెరాస మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ కాటారం మండల అధ్యక్షులు బండం వసంత రెడ్డి, మాజీ మండల ఉప అధ్యక్షులు నాగుల తిరుపతి రెడ్డి,

మాజీ కార్యదర్శి దోమల సమ్మయ్య, ఖమ్మం పల్లి సంజీవ్ లు బీజేపీ పార్టీ లో చేరారు అనంతరం వసంత రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కారులకు తెరాస ప్రభుత్వం ఎటువంటి గుర్తింపు లేదని సునీల్ మేమంతా కలిసి తెలంగాణ ఉద్యమంలో కష్టపడి ఎన్నో పదుల సంఖ్యల కేసులు పెట్టించుకుని పగలు రాత్రి అనకుండా నిద్ర లేకుండా భార్య పిల్లలను విడిచిపెట్టి పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ మమల్ని విస్మరించి ఇప్పుడు దొంగలను, భూకబ్జా దారులను

ఎంతోమందిని చేర్చుకొని ఉద్యమకారులను పార్టీ ఉద్యమంలో పార్టీని కాపాడిన వాళ్ళందరి వ మరిచిపోయిధి భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాని మార్గదర్శకంగా,పనిచేస్తున్నాడుబండి సంజయ్ చేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే అవినీతి మీద చేస్తున్న పోరాటం నచ్చి బిజెపి పార్టీలో చేరడం జరిగింది అవినీతి మీద నిరంతరం పోరాటం చేసి మంథని లో కాషాయపు జెండా ఎగురవేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపిస్తామని అన్నారు

సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కారులకు బీజేపీ పార్టీ లో మంచి గుర్తింపు ఉందని, కాంగ్రెస్, తెరాస లతో విసుగు చెంది బీజేపీ పార్టీ లో చేర్తున్నారు, రానున్న ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా మన రాష్టం లో అధికారం లోకి వస్తుందని అన్నారు వారి వెంట మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్, నాయకులు ఉడుముల వెంకట్ రెడ్డి, సాదుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page