కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు శంఖుస్థాపన

Spread the love

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్ కాలనీ రూ. 50 లక్షల రూపాయల అంచనావ్యయం తో ఎమ్మెల్యే CDP ఫండ్స్ మరియు (SD Funds) ప్రత్యేక నిధులతో నూతనంగా చేపట్టబోయే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మహాత్మ గాంధీ నగర్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే CDP మరియు SD ఫండ్స్(ప్రత్యేక నిధులు) రూ. 50 ,00 ,000 డెబ్భై లక్షల రూపాయలను ఎమ్మెల్యే CDP మరియు (SD FUNDS – ప్రత్యేక నిధుల ) నుండి 50 లక్షల రూపాయలు మంజూరి చేయడం జరిగినది అని , కమ్యూనిటీ హాల్ ను త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు  అందుబాటులోకి తీసుకురావాలని, సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు , జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా భవనంలను నిర్మించేందుకు  సంతోషంగా ఉందన్నారు. కాలనీల అభివృద్ధికి విశేషంగా  కృషి చేస్తానని ,మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధం అని ,ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి వచ్చిన పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .ఆల్విన్ కాలనీ డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయ షెక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ సందర్బంగా మహాత్మ గాంధీ నగర్ కాలనీ సభ్యులు   మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే కమ్యూనిటీ హాల్ కు నిధులు కేటాయించి సహాకరించిన ఎమ్మెల్యే గాంధీ కి  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని ,అదేవిధంగా ఎమ్మెల్యే గాంధీ   శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని  కొనియాడారు .

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు

  1. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహాత్మ గాంధీ నగర్ కాలనీ లో రూ .50 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులు

పైన పేర్కొన్న పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page