వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఫైల్ పంపించండి ఆర్ & బి అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి “కేసీఆర్” *

Spread the love

సాక్షిత : ముఖ్యమంత్రికేసీఆర్ ని మరియు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని వారి నివాసంలో కలిసి, పలు రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
వికారాబాద్ లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం గురించి ఎమ్మెల్యే ప్రస్తావించగా, వెంటనే ముఖ్యమంత్రి “కేసీఆర్” సంబంధిత శాఖమంత్రి “వేముల ప్రశాంత్ రెడ్డి” తో ఫోన్ లో మాట్లాడి వెంటనే నూతన బ్రిడ్జి నిర్మాణానికి ఫైల్ పంపించమని ఆదేశించి, 92 కోట్లతో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు.
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విన్నపం మేరకు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ కి మరియు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి వికారాబాద్ లో జరగాల్సిన పలు అభివృద్ధి అంశాలపై ఫోన్లో మాట్లాడారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page