ఈనెల 6న నిర్వహించనున్న మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Spread the love

ఈనెల 6న నిర్వహించనున్న మైనార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని ఈనెల 6వ తేదీన మైనారిటీ నాయకులతో కలిసి నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద హాజరవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులు మహమ్మద్ రఫీ, మక్సుద్ అలీ, డాక్టర్ హుస్సేన్, యూసుఫ్, సలీం జావిద్ బేగ్, ఇబ్రహీం ఖాన్, ఎండీ. ఫిరోజ్, మోయిజ్, అర్షద్, నదీమ్ రాయ్, శన్ను, మూసా ఖాన్, మంజూర్ అలీ తో పాటు ఇతర మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page