కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి

Spread the love

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అడిగారు. అనంతరం గాయత్రి మాట్లాడుతూ చేవెళ్లలో బిజెపి గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఓటర్లను కోరారు. భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని, కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.

Related Posts

You cannot copy content of this page