ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చంద్ర బాబు

Spread the love

శ్రీకాకుళం :

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ నున్నారు.

ఈ నెల 15వ తేదీన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాంలో ప్రజా గళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో పాల్గొంటారు. అనంతరం టెక్కలి, పలాస నియోజక వర్గాల్లో జరిగే ప్రజా గళం సభలకు హాజరు కానున్నారు.

ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా టీడీపీ నాయకులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో మరింత నూతనోత్సాహం నెలకొంది.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page