హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .


సాక్షిత :ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు చెప్పడం జరిగినది. డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మీ కాలనీలో కానీ, మీ బస్తి లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నన్ను కానీ, కార్పొరేటర్ కార్యాలయాన్ని కానీ సంప్రదించండి అని తెలియజేసారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ కాలనీ వాసులు నవీన్, ధర్మారెడ్డి, వేణుగోపాల్ రాజు, పవన్, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page