మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

Spread the love

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి నిరంతరం ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో కొనసాగాలని కోరమన్నారు

Related Posts

You cannot copy content of this page