ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు బీఎల్ సంతోష్.

Spread the love

BL Santosh to Hyderabad for the first time after the MLA purchase issue.

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు బీఎల్ సంతోష్..

హైదరాబాద్ : ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ వచ్చారు. బీఎల్ సంతోష్ హైదరాబాద్ పర్యటనపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. బీజేపీ పార్లమెంట్ విస్తారక్‌ల సమావేశంలో బీఎల్ సంతోష్ పాల్గొననున్నారు.

నిన్న వర్చువల్ గా విస్తారక్‌ల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు విస్తారక్‌ల శిక్షణ సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణపై కమలం పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మధ్యాహ్నం బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానుంది. తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గనికి ఒక పాలక్, ఒక విస్తారక్‌ను బీజేపీ నియమించనుంది.

పాలక్, విస్తారక్‌లతో సంతోష్ సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం‌పై దిశానిర్దేశం చేయనున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీలో చేరికలను వేగవంతం చేయాలని ఇప్పటికే కమలం పార్టీ నిర్ణయించింది..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page