127 వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ..

Spread the love

బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం….

3 కోట్ల వ్యయంతో సుభాష్ నగర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్, గాజులరామారం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కే పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా
130 సుభాష్ నగర్ డివిజన్, పరిధిలోని వెంకటసాయి అవెన్యూ లో రూ. 9.5 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, వేంకటాద్రి నగర్ లో రూ. 20 లక్షలతో సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు,
132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్ లో రూ. 70 లక్షలతో ఇండోర్ స్టేడియం, జైరాం నగర్ లో రూ.96 లక్షలతో భూగర్భ డ్రైనేజి, సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు, వినాయక్ నగర్ కాలనీలో రూ. 35 లక్షలతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజి నిర్మాణ పనులకు,


125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఆర్ కె లేఔట్ లో రూ.30.00 లక్షలతో చేపట్టనున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులు పాదయాత్ర చేస్తూ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోని అనేక బస్తీలు, కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేక దృష్టి వహించి కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి కాలనీ, బస్తీ రూపురేఖలు మారుతున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కాలనీ సంక్షేమ సంఘ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page