భరోసా ఇచ్చేనందుకు యువ తేజం

Spread the love

పల్నాడు జిల్లా

జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు, దగాపడ్డ యువత, మాయమాటలు నమ్మి మోసపోయిన ప్రజలకు నేనున్నా అనే భరోసా ఇచ్చేనందుకు యువ తేజం , తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జివి ఆంజనేయులు గారు అన్నారు.యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వినుకొండలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. వినుకొండ నుంచి శావల్యాపురం వరకు కొనసాగిన ఈ యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులూ, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా జివి ఆంజనేయులు గారు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర 100 రోజులు దిగ్విజయంగా పూర్తయిందని , నేడు రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ గారు ఉదయించే సూర్యుడిలా కనిపిస్తున్నారని అన్నారు. రోజురోజుకి నారా లోకేష్ గారి పాదయాత్రకు వస్తున్నా ఆదరణ చూసి వైసీపీ వెన్నులో వణుకు పుడుతోంది. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా జగన్ బండారం అంతా బయట పడుతోందని జివి ఆంజనేయులు గారు పేర్కొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page