వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే మా తొలి ఓటు

Spread the love

వైసీపీలో చేరిన రూరల్‌ పంచాయతీ యువకులు
– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత

అనంతపురం రూరల్‌ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద వైసీపీ కండువాలు వేసుకున్నారు. కొత్తగా ఓటర్లుగా మారిన తాము రానున్న ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేస్తామని యువకులు తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన బాగుందని, అనంతపురంలో అభివృద్ధి బాగా జరుగుతోందన్నారు. అందుకోసమే తాము ఈ ఎన్నికల్లో సైనికుల్లా పని చేసి వైసీపీ విజయానికి కృషి చేస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో యువకులు రాజసింహ, శివప్రసాద్, మురళి, మారుతి, మహి, శ్రీరాం, రియాజ్, ఇలియాజ్, భార్గవ్, శశికాంత్, లక్ష్మణ్‌ ఉన్నారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్‌ నేత అనంత చంద్రారెడ్డి, 33వ డివిజన్‌ కార్పొరేటర్‌ సాకే చంద్రశేఖర్‌ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page