కోటు గుర్తుపై ఓటు వేసిప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం

Spread the love

సాక్షిత : జై భీమ్ రావు భారత పార్టీ కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ఆళ్ళ.శివయ్య మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేబీపీ పార్టీకి ఓటు వేసి నియోజకవర్గం లోని అన్ని సమస్యలు పరిష్కారం చూపటానికి అవకాశం కల్పించాలని అన్ని ప్రాంతాలకు తాగునీటి సమస్య లేకుండా ఆరోగ్యవంతమైన వాతావరణంలో ప్రజలను పరిపాలన చేయాలని చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పథకాలు తీసుకొస్తామని ప్రతి గ్రామంలోనూ నిరక్షరాస్యతను తొలగించి ప్రతి ఒక్కరూ అక్షరాస్తులుగా చేయుటకు కావలసిన వస్తువులు కల్పిస్తామని విద్యా వైద్యం ఉచితంగా అందే విధంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామని జై భీమ్రావు భారత పార్టీ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ళ.శివయ్య తెలియపరిచారు

Related Posts

You cannot copy content of this page