పరిపాలన కేంద్రం అయిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు

Spread the love

The new building of Grama Sachivalaya which is the administrative center was inaugurated

సాక్షిత : * వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం వడ్డెoగుంట సచివాలయం పరిధిలో వడ్డెoగుంట గ్రామంలో నేడు గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి తిరుగుతూ, అర్హులైన ప్రజలకు వారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందిన సంక్షేమ పథకాలను, జరిగిన అభివృద్ధి ని వివరిస్తూ..

గ్రామంలో ప్రతి ఇంటికి గడప వద్దకు వెళ్లి వారికి ఇంకేమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామంలో నూతనంగా నిర్మించిన పాటిపాటెమ్మ అమ్మవారి దేవస్థానం కు నూతనంగా నిర్మించిన సిసి రోడ్డు ను మరియు గ్రామ పరిపాలన కేంద్రం అయిన గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల స్థాయి అధికారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page