ఇళ్ళ క్రమబద్ధీకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే

Spread the love

The MLA wants to see that there are no problems in the regularization of houses

ఇళ్ళ క్రమబద్ధీకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యేను కలిసిన గాంధీనగర్ వాసులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని గాంధీనగర్ సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ జీవో 59 ప్రకారం ఇంటి క్రమబద్ధీకరణ కోసం లక్షల్లో నగదు చెల్లించాలని నిరుపేదలు నివసించే గాంధీనగర్ వాసులకు డిమాండ్ నోటీస్ రావడంతో ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ప్రభుత్వం పునరావాసం కింద జీవో జారీ చేసి గాంధీనగర్ గ్రామాన్ని ఏర్పాటు చేసినందున తమకు ఉచితంగా ఇంటి క్రమబద్ధీకరణ చేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ని కోరారు.

దీంతో ఎమ్మెల్యే వెంటనే సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ , ఆర్డీవో తో ఫోన్లో మాట్లాడారు. పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు జల్దా రాఘవులు, సినీయర్ నాయకులు ఖాజామియ, నర్సింహ, ఎల్లయ్య, బిర్జు సింగ్, సత్యనారాయణ, హనుమయ్య, శ్రీనివాస్, యువజన నాయకులు జల్దా లక్ష్మినాథ్, సాయి గౌడ్, రహీమ్, శ్రీనివాస్, నర్సింహ, సురేష్, బాలవీరయ్య, రెనాల్డ్స్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page