మృతుని కుటుంబానికి అండగా మంత్రి పువ్వాడ

Spread the love


The minister sympathized with the family of the deceased

మృతుని కుటుంబానికి అండగా మంత్రి పువ్వాడ

కుటుంబాన్ని పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి పి ఎ రవికిరణ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రఘునాధపాలెం మండలం కోటపాడు గ్రామానికి చెందిన తెలూరి రమేష్ ఈ నెల 13న గ్రామంలో జరిగిన ఘర్షణలో గాయలుపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సందర్భంగా వారి మృతిదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీ లో మంత్రి పువ్వాడ పి ఎ చిరుమామిళ్ల రవికిరణ్ సందర్శించి నివాళ్ళుర్పించారు.

అనంతరం వారి కుటుంబానికి మంత్రి పువ్వాడ ఫౌండేషన్ ద్వారా పది వేల రూపాయల ఆర్థికసాయాన్ని అందజేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుని కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని అన్నారు.


ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంటెముక్కుల వెంకటేశ్వర్లు, నాయకులు సంగయ్య,ఆదాం, రాంబాబు, కిరణ్, వీరబాబు, ఉపేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page