మసీదులు అభివృద్ధి చేసినాం

Spread the love

గురుకుల పాఠశాలలు పెట్టినం

మరొకసారి ఆశీర్వదించండి

…..

సాక్షిత శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ మస్జీద్ ఈ హుస్సేనీ మరియు లింగంపల్లి మెయిన్ రోడ్డు యందు మోతి మస్జిద్ ల వద్ద చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ముస్లిం సోదరులకు స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలను ఇచ్చి ప్రచారం చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

మస్జీద్ ల వద్ద ఎన్నికల ప్రచారం అనంతరం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని చెప్పారు. మరొకమారు కారు గుర్తుకు ఓటు వేసి కాసాని ని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page