ఖమ్మం లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను జయప్రదం చేయాలి..

Spread the love

ఖమ్మం లో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను జయప్రదం చేయాలి..
మాలోత్ నెహ్రూ నాయక్
డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యులు


*సాక్షిత : హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన *డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ *,మరియు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండపల్లి రఘురాం రెడ్డి వారు మాట్లాడుతూ *పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి * కాంగ్రెస్స్ పార్టీ చేరుతునందుకు వారికి ప్రత్యేక దన్యవాదాలు అని,పొంగులేటి ప్రజల మనిషని,వారి చేరికతో ఖమ్మం లో పదికి పది సీట్లు గెలుచుకోవడం మే కాకుండా తెలంగాణ వ్యాపతంగా ప్రభావితం చేయగలరని,ఖమ్మం లో జరిగే బారి బహిరంగ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు,పొంగులేటి అభిమానులు,మహిళలు, స్వచ్ఛందంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని,రాహూల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేసే వరుకు,తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం వచ్చే వరుకు ప్రతి నాయకుడు,కార్యకర్తలు కష్టపడాలి అని తెలిపారు ,డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్స్ పార్టీ పరిస్థితులపై పొంగులేటి అడిగి తెలుసుకున్నారు,నిత్యం నియోజకవర్గం లో ప్రజలకు సమస్య వచ్చిన, పేదచనిపోయిన కుటుంబాలకు,నూతన దేవాలయ నిర్మాణాలకు,నిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతున్న నెహ్రూ నాయక్ ని శ్రీనివాస్ రెడ్డి అభినందించారు వారి వెంట డోర్నకల్ మండల నాయకులు గుగులోతు లాలు నాయక్,డిఎస్ జగదీష్,బానోతు పకీరా నాయక్, సీరోల్ మండల నాయకులు బానోతు రాందాస్,వార్డు సభ్యులు సిరిసవాడ శ్రీను త సమావేశం లో పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page